టాలీవుడ్ నుంచి మరో రీరిలీజ్ సినిమా.. ఖడ్గం మళ్లీ వస్తోంది

టాలీవుడ్ నుంచి మరో రీరిలీజ్ సినిమా.. ఖడ్గం మళ్లీ వస్తోంది

దేశభక్తి కథాంశంతో 22 ఏళ్ల క్రితం ‘ఖడ్గం’ సినిమాను తెరకెక్కించారు కృష్ణవంశీ. ఇప్పుడీ సినిమాను రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అక్టోబర్ 18న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ ‘ ‘మన జాతీయ జెండా ఒక ఖడ్గం’ అనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టాం. సినిమా తీయడంలో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి, సహకరించిన నటీనటులకు థ్యాంక్స్.  ఇన్నేళ్ల తర్వాత ఈ  సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తుండడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు. తమ జీవితంలో మర్చిపోలేని సినిమా ఇదని,  అలాంటి సినిమా రీ రిలీజ్ కావడం హ్యాపీగా ఉందంటూ శ్రీకాంత్,  శివాజీరాజా,  షఫీ ఆనందం వ్యక్తం చేశారు.