
గోదావరిఖని, వెలుగు : స్టూడెంట్లు స్కిల్స్పెంచుకునేలా ట్రైనింగ్ఇవ్వాలని కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోనే మొదటిసారిగా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఎస్ ఫౌండేషన్ ఫౌండర్, సైంటిస్ట్ బి.మల్లేశం పర్యవేక్షణలో బుధవారం అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఎల్ఈడీ బల్బు తయారీపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా 2026-–27 నుంచి విద్యార్థులకు 27 టెక్నికల్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్ క్లబ్జనరల్సెక్రటరీ పందిళ్ల శ్యామ్సుందర్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ బైరం సతీశ్, సెక్రటరీ సత్యనారాయణ, హెచ్ఎం రామకృష్ణ, రాజిరెడ్డి, సత్యనారాయణ, శైలజ, టీచర్లు పాల్గొన్నారు.