ఫ్యామిలీ అంతా నవ్వుకునే మూవీ : డైరెక్టర్ మారుతి

ఫ్యామిలీ అంతా నవ్వుకునే మూవీ : డైరెక్టర్ మారుతి

రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా జె శివసాయి వర్ధన్ రూపొందించిన చిత్రం ‘భలే ఉన్నాడే’. డైరెక్టర్ మారుతి సమర్పణలో  ఎన్‌‌‌‌‌‌‌‌వి కిరణ్ కుమార్ నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో మారుతి మాట్లాడుతూ ‘ఈ సినిమాతో టీమ్ అందరికీ ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది.  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శివ సాయి, హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా మనీషా, ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  కిరణ్..  ఇలా కొత్త టీమ్ పరిచయం అవుతున్నారు. వీళ్ళ కష్టానికి తగిన ఫలితం మంచి హిట్ ద్వారా వస్తుందని బలంగా కోరుకుంటున్నా.  

కథ, మాటలు, పాటలు, ఎమోషన్స్ అన్నీ బాగా కుదిరాయి.  మంచి మెసేజ్ కూడా ఉంటుంది.  ప్రజెంట్ జనరేషన్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘మారుతి గారితో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్. అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని అన్నాడు. ఇందులో తన  క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుందని మనీషా చెప్పింది. 

ప్రేక్షకులు నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటికి వస్తారని దర్శకుడు శివ సాయి చెప్పాడు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత కిరణ్ అన్నారు. నటులు వీటీవీ గణేష్, అభిరామి, రాజా రవీంద్ర, సప్తగిరి,  మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.