రజినీకాంత్ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్

రజినీకాంత్ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్

గత ఏడాది తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే తండ్రీ కొడుకుల సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ చిత్రం బాక్సాఫిస్ వద్ద రూ.650 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. 

ఇక ఈ చిత్రంలో రజినీకాంత్ యాక్టింగ్ తో పాటూ కామియో అప్పియరెన్స్ పాత్రల్లో నటించిన శివ రాజ్ కుమార్ (కన్నడ), మోహన్ లాల్(మలయాళం), టైగర్ ష్రాఫ్ (హిందీ) తదితర పాత్రలు కూడా బాగానే మెప్పించాయి. దీంతో ఈ చిత్ర సీక్వెల్ పై ఆసక్తి నెలకొంది.

ALSO READ | Sai Pallavi: మనసుని హత్తుకునేలా సాయి పల్లవి, శివ కార్తికేయన్ ఎమోషనల్ జర్నీ.. వీడియో చూశారా!

తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ చిత్ర సీక్వెల్ పై స్పందించాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం తాను మరియు తన టీమ్ జైలర్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసే పనిలో ఉన్నట్లు తెలిపాడు. దీంతో రజనీకాంత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

జైలర్ 2 చిత్రంలో ఊహించని ట్విస్టులు, డైలాగులు వేరే లెవెల్ లో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. కాగా 2025 నాటికి రజినీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తీ కావస్తుండటంతో వచ్చే ఏడాది జైలర్ 2 ని విడుదల చేయనున్నట్లు సమాచారం.  

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రజినికాంత్ తమిళ్ లో వెట్టాయాన్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రం అక్టోబర్ 10వ తారీఖున విడుదల కాబోతోంది.