ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి : బి.రవీంద్ర నాయక్​

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి : బి.రవీంద్ర నాయక్​

హనుమకొండ/ కాశీబుగ్గ, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని స్టేట్ హెల్త్ డైరెక్టర్ బి.రవీంద్ర నాయక్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచమ్మకుంట అర్బన్ హెల్త్ సెంటర్ ను శుక్రవారం ఆయన హనుమకొండ డీఎంహెచ్​వో డాక్టర్ లలితాదేవితో కలిసి సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలు,  వివిధ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. పోచమ్మకుంట హెల్త్ సెంటర్​ పరిధిలో ఈ ఏడాది నమోదైన డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులు, జ్వర సర్వే, వైద్య శిబిరాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 

స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యారోగ్య సిబ్బందికి సూచించారు. మాతా, శిశు సంరక్షణ, ఎన్​సీడీ, టీబీ తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై ఆరా తీశారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్​వో డాక్టర్ టి.మదన్మోహన్ రావు, ఎన్​సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్, డాక్టర్లు నాగరాజు, హరిత తదితరులున్నారు. 

వరంగల్​కు వచ్చిన డీహెచ్​ను తెలంగాణ ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల శరత్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి, ఫార్మసిస్ట్​ల సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన డీహెచ్​ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్స్ అసోసియేషన్​ హనుమకొండ కార్యదర్శి జి.సతీశ్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.ప్రేమ్ సాగర్, ఎం.అవినాశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.