Ashwatthama in PVCU: బాక్సాఫీస్ బద్దలయ్యే న్యూస్.. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో అశ్వత్థామ

Ashwatthama in PVCU: బాక్సాఫీస్ బద్దలయ్యే న్యూస్.. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో అశ్వత్థామ

హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్ ఫేమ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో ప్రశాంత్ తన పేరుతో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులోనే వరుస సినిమాలు చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. 

అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుస్తున్నారు. ఈసారి మరింత భారీ బడ్జెట్ తో, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మరింత థ్రిల్ చేయడానికి సిద్దమవుతున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తాజాగా ఆయన సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో ముచ్చటించారు. ఆ క్రమంలో ఓ నెటిజన్ ప్రశాంత్ ను అదిరిపోయే ప్రశ్న వేశాడు. మీరు మన పురాణాల్లో చిరంజీవులుగా ఉన్న వారిని ప్రధాన పాత్రలుగా తీసుకొని సినిమాలు చేస్తానని చెప్పారు కదా.. మీ యూనివర్స్ లో అశ్వత్థామ పాత్ర కూడా ఉంటుందా.. అని అడిగారు.     

దానికి సమాధానంగా ప్రశాంత్ స్పందిస్తూ.. దాని గురించి ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ, మీరు ఊచించే ప్రతీ పాత్ర ఉంటుంది.. అంటూ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు ప్రశాంత్. దాంతో.. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో అశ్వత్థామ ఎంట్రీ అంటూ అప్పుడే వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇది గనుక నిజమైతే ఇండియన్ బాక్సాఫిస్ షేక్ అవడం ఖాయం అంటున్నారు నెటిజన్స్.