![దివ్యాంగుల చలో ఢిల్లీ](https://static.v6velugu.com/uploads/2025/02/disabled-community-from-bodhan-division-heads-to-delhi-for-dharna-program_b26vlyXpK7.jpg)
బోధన్, వెలుగు: బోధన్డివిజన్లోని దివ్యాంగులు శుక్రవారం చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈసందర్భంగా దివ్యాంగుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి యేశాల గంగాధర్ మాట్లడుతూ.. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 10న ఢిల్లీలో మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని, ధర్నాలో పాల్గొనేందుఉ బయలుదేరి వెళ్తున్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు కేవలం రూ.300 ఫించన్ఇస్తోందని, కనీసం నెలకు రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి దివ్యాంగుడికి ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పని కల్పించాలన్నారు. దివ్యాంగుల ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల రుణం ఇవ్వాలని, దివ్యాంగుల కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకమైన స్కూల్స్ నిర్మించాలని డిమాండ్చేశారు. ఢిల్లీకి బయలుదేరిన వారిలో బోధన్పట్టణ ప్రధాన కార్యదర్శి గంపల శంకర్, జిల్లా కోశాధికారి రామ్ పటేల్, నాగనాథ్పటేల్, ఎల్లయ్య, చింటూ, సాయినాథ్, జగన్ తదితరులున్నారు.