54  స్కూళ్లను దత్తత తీసుకున్న దిశ ఫౌండేషన్

54  స్కూళ్లను దత్తత తీసుకున్న దిశ ఫౌండేషన్

ములుగు, వెలుగు : విద్యాభివృద్ధిలో భాగంగా ములుగు జిల్లాలో దిశా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మండలానికి ఆరు పాఠశాలల చొప్పున మొత్తం 54  ప్రైమరీ స్కూళ్లను దత్తత తీసుకున్నట్లు ఫౌండేషన్​ జనరల్​ మేనేజర్​ సి.మురళీధర్​ తెలిపారు. అందులో భాగంగా గురువారం దత్తత తీసుకున్న పాఠశాలల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు మురళీధర్​తోపాటు చీఫ్​ మెడికల్​ ఆఫీసర్​ డాక్టర్​ పి.వేణుబాబు, పర్సనల్ ఎగ్జిక్యూటీవ్​ ఆఫీసర్ దుర్గాప్రసాద్​, ఈసీఐఎల్​ టీం సభ్యులు  ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు.   దిశా ఫౌండేషన్ ప్రతినిధులు ఐశ్వర్య, ప్రతిభ, జిల్లా వైద్యాధికారి డాక్టర్​ గోపాల్ రావు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అర్షం రాజు, గుల్లపెల్లి సాంబయ్య, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.