కొడంగల్​సెగ్మెంట్​పరిధిలో సీఎంఆర్ఎఫ్​చెక్కుల పంపిణీ

కొడంగల్​సెగ్మెంట్​పరిధిలో సీఎంఆర్ఎఫ్​చెక్కుల పంపిణీ

కొడంగల్, వెలుగు: కొడంగల్​సెగ్మెంట్​పరిధిలో 179 మంది లబ్ధిదారులకు రూ. 93 లక్షల సీఎం రిలీఫ్​ఫండ్​చెక్కులను పంపిణీ చేశారు. సోమవారం కడా ఆఫీస్​లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్​పార్టీ ఇన్​చార్జి తిరుపతిరెడ్డి, కడా స్పెషల్​ఆఫీసర్​వెంకట్​రెడ్డి కలిసి చెక్కులు అందజేశారు. 

పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్​నేతలు రాజేశ్​రెడ్డి, విజయ్​కుమార్​, ప్రశాంత్, నర్సింహులు గౌడ్, వెంకట్​రావు ఉన్నారు.