కామారెడ్డిలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కామారెడ్డిలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి నియోజక వర్గంలోని ఆయా మండలాల్లో 256 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పంపిణీ చేశారు.  రాజంపేట మండలంలో 18 మందికి, భిక్కనూరులో 34,  దోమకొండలో 49,  బీబీపేటలో 32,  మాచారెడ్డిలో 39, రామారెడ్డిలో 36, కామారెడ్డి రూరల్​లో 41, కామారెడ్డి టౌన్​లో 151 మందికి చెక్కులు అందజేశారు.  

స్వదేశీ మేళా బ్రోచర్ల ఆవిష్కరణ

స్వదేశీ జాగరణ మంచ్, స్వావలంబి భారత్​అభియాన్​సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు హైదరాబాద్​లోని పీపుల్స్​ ప్లాజాలో నిర్వహించే స్వదేశి మేళా బ్రోచర్లను మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆవిష్కరించారు.  స్వదేశీ ఉత్పత్తులను ప్రొత్సహించే విధంగా మేళా ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు.  ప్రతినిధి రచ్చ శ్రీనివాస్, స్వదేశీ జాగరణ మంచ్​ ప్రాంత ప్రచార ప్రముఖ్​కేశవ్​సోని, ఇందూర్​ విభాగ్​ జిల్లా కో కన్వీనర్​ రాజాగౌడ్, జిల్లా కన్వీనర్​ రాహుల్, మనీష్​, నరేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.