కుక్కల బెడదపై జడ్జి డి.రవీంద్ర శర్మ సీరియస్​

కుక్కల బెడదపై జడ్జి డి.రవీంద్ర శర్మ సీరియస్​

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలో కుక్కల బెడదపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్ర శర్మ అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన పంచాయతీ అధికారి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పి.వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్​స్పెక్టర్ మల్లిగారి మధును మంగళవారం సాయంత్రం తన ఛాంబర్​కు పిలిపించుకొని సమీక్షించారు.

కోర్టు ఆవరణలో కూడా కుక్కలు ఎక్కువయ్యాయని, కక్షిదారులకు, న్యాయవాదులకు ఇబ్బందిగా మారిందన్నారు. తక్షణం కోర్టు ఆవరణ నుంచి కుక్కలను తరలించాలని ఆదేశించారు. జనగామ పట్టణంలోని పలువార్డుల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుందని, దీనిపైనా చర్యలు చేపట్టాలన్నారు.