విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

 విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

మహబూబాబాద్ అర్బన్/ తొర్రూరు, వెలుగు: చట్టాలపై ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని జిల్లా సివిల్ జడ్జి తిరుపతి, తొర్రూరు  జూనియర్​ సివిల్​ కోర్టు జడ్జి సరిత అన్నారు. శనివారం మహబూబాబాద్ ​ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో, తొర్రూరు పట్టణంలోని మైనార్టీ స్కూల్​లో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సందస్సును నిర్వహించారు.

 ఈ కార్యక్రమాల్లో జడ్జిలు మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు తలెత్తితే అధైర్య పడకుండా చట్టం కల్పించిన హక్కుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల సదానందం, పాఠశాల ప్రిన్సిపాల్​ వనజ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.