గణేశ్ ఉత్సవాలపై దృష్టి పెట్టండి :కలెక్టర్​ అభిలాష అభినవ్​

గణేశ్ ఉత్సవాలపై దృష్టి పెట్టండి :కలెక్టర్​ అభిలాష అభినవ్​
  • నిర్మల్​ జిల్లా కలెక్టర్​ అభిలాష అభినవ్​

భైంసా, వెలుగు: భైంసా పట్టణంలో జరిగే గణేశ్​నవరాత్రి ఉత్సవాలపై  అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్​ అభిలాష అభినవ్​ సూచించారు.  గురువారం భైంసాలోని గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రూట్​ మ్యాప్​ను పరిశీలించారు. ఆయా కాలనీల్లో ప్రతిష్ఠించే గణేశ్ మండపాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గడ్డెన్న ప్రాజెక్టు వద్ద నిమజ్జన స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడారు.  

సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శోభాయాత్ర మార్గంలో కరెంటు తీగలు సరి చేసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్​ ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై కమిషనర్​రాజేశ్​కుమార్‌‌ను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశముందని, హాస్పిటల్​కు వచ్చే రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని వైద్యులకు కలెక్టర్​సూచించారు. కలెక్టర్​ వెంట ఏఎస్పీ అవినాష్​ కుమార్​, ఆర్డీవో కోమల్​ రెడ్డి, కమిషనర్​ రాజేశ్ కుమార్, ​సీఐ రాజారెడ్డి, సూపరింటెండెంట్ డా. కాశీనాథ్​, పలు శాఖల అధికారులు ఉన్నారు.