
- టీచర్స్ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్ ఎక్కా
- అధికారులతో రివ్యూ మీటింగ్
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లా వ్యాప్తంగా టీచర్స్ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా టీచర్స్ఎన్నికల పరిశీలకులు మహేష్దత్అన్నారు. మెదక్లో బుధవారం టీచర్స్ ఎన్నికల విధులు నిర్వహించే నోడల్ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ దత్మాట్లాడుతూ.. ఈ నెల 27న జరిగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై వివరాలను తెలుసుకున్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలు-21 ఉండగా,1,347 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఈనెల 11వ తేదీన పీవోలు, ఏపీవోలకు ట్రైనింగ్ నిర్వహించామని... రెండో విడత ఈనెల 21న ట్రైనింగ్ పూర్తవుతుందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని వివరించారు.సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్నగేశ్, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ ఆర్డీవోలు రమాదేవి, జయచంద్రారెడ్డి, మహిపాల్రెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్ రావు, డీపీవో యాదయ్య, సంబంధిత శాఖ అధికారులు, నోడల్ అధికారులు తదితీరులు పాల్గొన్నారు.