
మెదక్ టౌన్, వెలుగు: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు ''ఏక్ తారీఖ్ ఏక్ గంట ఏక్ సాథ్'' అనే కార్యక్రమంలో భాగంగా ఒక గంట పాటు శ్రమదానం చేశారు.
జిల్లా కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కల్పన, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్జానకీ రామ్సాగర్తో కలిసి పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, మెప్మా టీఎంసీ సునీత, న్యాయవాదులు, పట్టణ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, వార్డు ఆఫీసర్లు, జవాన్లు, శానిటేషన్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.