స్కానింగ్ సెంటర్లలో రికార్డులు పక్కగా ఉండాలి

స్కానింగ్ సెంటర్లలో రికార్డులు పక్కగా ఉండాలి

కామారెడ్డి టౌన్, వెలుగు : స్కానింగ్ సెంటర్లలో రికార్డులు పక్కగా ఉండేలా అధికారులు చూడాలని జిల్లా జడ్జి  వరప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్​లో హెల్త్ డిపార్మెంట్ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ పరీక్ష చట్టం అమలుపై జరిగిన మీటింగ్​లో జడ్జి మాట్లాడారు. స్కానింగ్​ సెంటర్లు రూల్స్ పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ మాట్లాడుతూ స్కానింగ్​ సెంటర్లను తరచూ తనిఖీలు చేయాలని,   లింగ నిర్ధారణ టెస్టులు చేస్తే గుర్తింపులు రద్దు చేయాలన్నారు.  అనంతరం హాస్పిటల్స్​ పర్మిషన్లపై చర్చించారు.    రూల్స్​ పాటించని హాస్పిటల్స్​కు పర్మిషన్లు ఇవ్వకూడదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎంహెచ్​వో  చంద్రశేఖర్,  అధికారులు శిరిష, విద్య, ప్రభుకిరణ్, ఐఎంఏ సెక్రటరీ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.