
జనగామ అర్బన్, వెలుగు: జిల్లాస్థాయి సీఎం కప్–2024 పోటీలను జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ సోమవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునతో కలిసి జెండాను ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వాలీబాల్, బ్యాడ్మెంటన్, బేస్బాల్ క్రీడలని వారు ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్వో వెంకట్రెడ్డి, మున్సిపల్కమిషనర్వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.