మంచిర్యాల జిల్లాలో  ఉత్సాహంగా జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు

మంచిర్యాల జిల్లాలో  ఉత్సాహంగా జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా సైన్స్ సెంటర్​లో శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్​ డ్రామా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. సైన్స్ అండ్​టెక్నాలజీతో పాటు ప్రపంచ నీటి సంక్షోభం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విపత్తులను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతలు, ఆరోగ్యం, పరిశుభ్రత, వాతావరణ మార్పు దాని ప్రభావం అంశాలపై పోటీలు నిర్వహించారు. కాసిపేట మోడల్​స్కూల్​విద్యార్థులు ఫస్ట్​ ప్లేస్​లో నిలిచి అక్టోబర్​లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సబ్బెపల్లి జడ్పీఎస్​ఎస్​ విద్యార్థులు సెకండ్​ ప్లేస్​లో నిలిచారు. సైన్స్​ ఆఫీసర్​ మధుబాబు ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో చీఫ్ ​గెస్ట్​గా డీఈవో యాదయ్య పాల్గొన్నారు