వరంగల్‍ జిల్లాలో హాస్టళ్లను తనిఖీ చేసిన జిల్లా అధికారులు

వరంగల్‍ జిల్లాలో హాస్టళ్లను తనిఖీ చేసిన జిల్లా అధికారులు

వరంగల్‍/ ఖిలా వరంగల్/ స్టేషన్​ఘన్​పూర్/ శాయంపేట/ నర్సింహులపేట (మరిపెడ): వెలుగు: జిల్లా ఉన్నతాధికారులు హాస్టళ్ల బాట పట్టారు. బుధవారం వరంగల్​ కలెక్టర్​ సత్యశారద ప్రభుత్వ ఎస్సీ కళాశాల గర్ల్స్​ హాస్టల్, ఖిలా వరంగల్​ అరెప్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్భించగా, జనగామ కలెక్టర్ రిజ్వాన్​ బాషా షేక్ చిల్పూరు మండలం కరుణాపురం మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్​ జూనియర్​ కాలేజీని సందర్శించారు. మరిపెడ రెసిడెన్షియల్​ జూనియర్​ కాలేజ్, ట్రైబల్​ వెల్ఫేర్​ ఆశ్రమ పాఠశాల హాస్టళ్లను మహబూబాబాద్​  కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్​, హనుమకొండ అడిషనల్​ కలెక్టర్​ వెంటక్​రెడ్డి శాయంపేట మండలం మాందారిపేట కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసి, సమస్యలపై ఆరా తీశారు.

 ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం ఫుడ్​ అందుతుందా, భోజనంలోని ఆహార పదార్థాలు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్లతో మాట్లాడుతూ వారితో కలిసి భోజనం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మందారిపేటలో భోజనం సరిగా లేకపోవడం, వసతులు సరిగా లేకపోవడంతో అడిషనల్​ కలెక్టర్​ అధికారులు, నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.  జనగామ అడిషనల్​ కలెక్టర్లు రోహిత్​ సింగ్​ పాలకుర్తి ఎస్సీ బాలుర హాస్టల్, పింకేశ్​ కుమార్​ జనగమ మండలం షామీర్​పేట మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేశారు.