తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి : శరత్​

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి : శరత్​

నిజామాబాద్, వెలుగు : వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్టేట్​ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్​ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు.  మంగళవారం కలెక్టర్ రాజీవ్​గాంధీతో కలిసి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. తాగునీటి సమస్య ఉన్న  ఆవాసాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. రిపేరింగ్​ బోర్లు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు.  గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.  కలెక్టర్​ రాజీవ్​గాంధీ మాట్లాడుతూ నిజామాబాద్, బోధన్, ఆర్మూర్​ టౌన్​లలో తాగునీటి సరఫరా చేసే జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయన్నారు.  

మండలాల్లో ఎంపీడీవో, ఎంపీవోతో కూడిన క్లస్టర్ టీంలు నిరంతర పర్యవేక్షించాలన్నారు. వారంలో ఒక రోజు మండల స్పెషల్​ ఆఫీసర్లను విజిట్​కు పంపి గ్రౌండ్​ రియాల్టీ సేకరిస్తామని ఎక్కడా నీటి కొరత రాకుండా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక కమిషనర్ దిలీప్ కుమార్, మిషన్​ భగీరథ, ఆర్​డబ్ల్యూఎస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

నీటి కొరత రాకుండా చూడాలి

కామారెడ్డి టౌన్​,  వెలుగు : ఎండ కాలంలో  జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా  ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా స్పెషల్ ఆఫీసర్​  , స్టేట్​ ట్రైబల్​ వెల్ఫేర్​ సెక్రటరీ ఏ.శరత్​ పేర్కొన్నారు.  మంగళవారం సాయంత్రం ఆయన కామారెడ్డి జిల్లాకు వచ్చారు.  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​తో పలు అంశాలపై చర్చించారు.