న్యూఢిల్లీ: దివీస్ ల్యాబ్స్ లిమిటెడ్ నికర లాభం ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఏడాది ప్రాతిపదికన 20.7శాతం పెరిగి రూ.430 కోట్లకు చేరుకుంది. అయితే సీక్వెన్షియల్గా లాభం 20శాతం క్షీణించింది. ఆదాయం 19.12శాతం పెరిగి రూ. 2,118 కోట్లకు చేరుకుంది. ఇబిటా 23.4శాతం పెరిగి రూ. 622 కోట్లకు ఎగిసింది. మార్జిన్ 28.3శాతం నుంచి 29.3శాతానికి పెరిగింది. లో బేస్, భారీ అమ్మకాల కారణంగా లాభం పెరిగిందని కంపెనీ తెలిపింది. శుక్రవారం కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 1.74 శాతం పెరిగి రూ.4,973 వద్ద ముగిశాయి.