![సర్కారు దవాఖానాల్లో డెలివరీల సంఖ్య పెంచాలి : భాస్కర్ నాయక్](https://static.v6velugu.com/uploads/2024/07/dmh-v-bhaskar-naik-advised-doctor-to-increase-number-of-deliveries-in-government-hospitals_UefZEbGwMd.jpg)
జూలూరుపాడు/అన్నపురెడ్డిపల్లి, వెలుగు : సర్కారు దవాఖానాల్లో డెలవరీల సంఖ్య పెంచాలని డీఎంహెచ్ వో భాస్కర్ నాయక్ డాక్టర్లకు సూచించారు. బుధవారం జూలూరుపాడు, ఎర్రగుంట పీహెచ్సీలను ఆయన సందర్శించారు.
ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు. శానిటేషన్ పై దృష్టి సారించాలన్నారు. వర్షా కాలంలో విష జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆయన వెంట డీఐవో బాలాజీ నాయక్, డాక్టర్లు ఉన్నారు.
Also Read : మహబూబ్నగర్లో ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం