
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో జరుగుతున్న విద్యార్థులకు కంటి పరీక్షల ప్రత్యేక వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఆర్బీఎస్కే టీమ్ లో ఆప్తాలమిక్ ఆఫీసర్లు రెండు విడతలుగా అన్ని స్కూళ్లలో విద్యార్థులకు స్క్రీనింగ్ చేసి దాదాపు 3,500 మందికి కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. ఆపరేషన్ అవసరం అనుకుంటే హైదరాబాద్ పంపి, వారికి తగిన చికిత్సలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చందునాయక్, డెమో సాంబశివరెడ్డి, కంటి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
అక్యూపంక్చర్ ఆస్పత్రి తనిఖీ
ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలోని కమాన్ బజార్ లో ఉన్న అక్యూపంక్చర్ ఆస్పత్రిని మంగళవారం డీఎంహెచ్వో కళావతి బాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ కు రిజిస్ట్రేషన్ లేకుండా ఎలా ప్రాక్టీస్ చేస్తారని ఆమె స్టాఫ్ ను ప్రశ్నించారు. ఆ సమయంలో డాక్టర్ పేర్కొన్న పి. విజయభాస్కర్ లేకవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అతడికి సంబంధించి ఎలాంటి అర్హత పత్రాలు లేకపోవడాన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో సైదులు, పీవో(సీహెచ్ ఐ)డాక్టర్ చందునాయక్, డెమో సాంబశివరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
.