
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లలో జిల్లా వ్యాప్తంగా చార్జీలు ఒకే రకంగా ఉండాలని డీఎంహెచ్వో ఎల్.భాస్కర్ నాయక్ సూచించారు. డీఎంహెచ్వో ఆఫీస్లో ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, ఐఎంఎ అసోసియేషన్ ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నడుస్తున్న ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో బ్లడ్ టెస్టులు, అల్ట్రా సౌండ్ స్కాన్, ఎక్స్రేలకు తీసుకుంటున్న ఫీజులపై నియంత్రణ అవసరమన్నారు.
గతంలో కన్నా 20శాతం తగ్గించి తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణ ప్రసాద్, సెక్రటరీ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, ట్రెజరర్ డాక్టర్ ప్రవీణ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతి, డాక్టర్ రత్నకుమారి, ప్రయివేట్ డయాగ్నస్టిక్ అసోసియేషన్ ప్రతినిధులు, డిప్యూటీ డెమో ఫయాజుద్దీన్ పాల్గొన్నారు.