- అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం
బషీర్ బాగ్, వెలుగు: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) పరిమితి పెంపుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. బషీర్బాగ్లో మంగళవారం ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత మిశ్రా మాట్లాడారు.
బీమా పరిశ్రమలో ఎఫ్డీఐల అవసరం ఏమాత్రం లేదన్నారు. విదేశీ పెట్టుబడిదారులను తృప్తి పరచడానికి బడ్జెట్లో కేంద్రం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలు బీమా పరిశ్రమను 1956 కంటే ముందు రోజులకు తీసుకువెళ్తాయన్నారు. పాలసీదారులు, సాధారణ పౌరులు, ప్రభుత్వ రంగ బీమా పరిశ్రమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ అనాలోచిత నిర్ణయాలపై ప్రజల మద్దతుతో పోరాటాలు చేస్తామన్నారు. అందరూ భాగస్వాములై ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.