
- ఖమ్మం జిల్లాలో వినూత్నంగా పెండ్లి చేసుకున్న పంచాయతీ కార్యదర్శి
ఖమ్మం రూరల్, వెలుగు : ప్రస్తుత కాలంలో ఫంక్షన్ల ఏదైనా ప్లాస్టిక్ వాడకం తప్పనిసరైంది. ఖమ్మం జిల్లాలో ఒక పెండ్లిలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం పంచాయతీ కార్యదర్శి ఈదగాని సంపత్ తన పెండ్లిని ఆదివారం ఖమ్మం రూరల్ పరిధిలోని మారెమ్మ టెంపుల్ వద్ద ఫంక్షన్ హాల్లో చేసుకున్నాడు.
ఈ పెండ్లి తంతులో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువు వాడలేదు. వివాహ స్వాగత బోర్డు నుంచి పెండ్లి మండపం దాకా అన్ని వస్తువులను ప్లాస్టిక్ లేకుండా చూశాడు. పూలు, అరటి ఆకులు, మట్టి గ్లాసులు, అల్యూమినియం చైర్లు వినియోగించాడు. ఒక్క ప్లాస్టిక్ ముక్క కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. పెండ్లికి వచ్చిన బంధువులు, అతిథులు ప్లాస్టిక్ లేకపోవడం చూసి పెండ్లి కొడుకు సంపత్ను అభినందించారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చర్చించుకున్నారు.