చెప్పులు విడిచి రమ్మన్నందుకు డాక్టర్​పై దాడి

చెప్పులు విడిచి రమ్మన్నందుకు డాక్టర్​పై దాడి
  • గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో  ఘటన

భావ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌: ఎమర్జెన్సీ రూంలోకి వచ్చిన రోగి బంధువులను.. చెప్పులు బయట విడిచి రావాలని చెప్పినందుకు డాక్టర్​పై దాడి చేశారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్​అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఓ మహిళ తలకు గాయం కావడంతో భావ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని సిహోర్‌‌‌‌‌‌‌‌ లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎమర్జెన్సీ రూంలో ట్రీట్​మెంట్​తీసుకుంటోంది. 

గత శనివారం ఆమెను చూసేందుకు కొందరు బంధువులు ఆస్పత్రికి వచ్చారు. వారు చెప్పులు వేసుకొని నేరుగా ఎమర్జెన్సీ రూంలోకి వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన డాక్టర్​ వారిని చెప్పులు గది బయట విడిచి రావాలని సూచించాడు. అందుకు వారు ఒప్పుకోకపోవడమే కాకుండా డాక్టర్​తో ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా ముగ్గురు వ్యక్తులు డాక్టర్​పై విచక్షణారహితంగా దాడి చేశారు. ట్రీట్​మెంట్​తీసుకుంటున్న మహిళతో పాటు గదిలో ఉన్న నర్సింగ్ సిబ్బంది సైతం వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారు ఆగలేదు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. డాక్టర్ -జైదీప్‌‌‌‌‌‌‌‌ సిన్హ్ గోహిల్ ఫిర్యాదు మేరకు నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాను పోలీసులు అరెస్టు చేశారు.