
హైదరాబాద్, వెలుగు: దేశీయ టెక్స్టైల్ కంపెనీ మై ట్రైడెంట్2027 నాటికి భారత వ్యాపారం మూడు రెట్ల వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2025-–26లో క్యాపిటల్ ఎక్స్పెండించర్కోసం రూ.1,000 కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది.దేశీయ టెక్స్టైల్, నూలు, ఇంధన వ్యాపారాల్లో ఆస్తుల పెంపు కోసం భారీగా నిధులను కేటాయించనుంది.
విస్తరణలో భాగంగా లగ్జ్హోం వెర్టికల్ద్వారా లగ్జరీ విభాగంలోకి మై ట్రైడెంట్ ప్రవేశించింది.హస్తకళ, హోమ్టెక్స్ టైల్లో క్వాలిటీ ప్రొడక్టులను దీని ద్వారా అందిస్తారు. ఈ కలెక్షన్లో ఎంపిక చేసిన ప్రీమియం బెడ్డింగ్తో పాటు అత్యుత్తమ మృదుత్వం, మన్నిక కలిగి ప్రత్యేకంగా రూపొందించిన టవల్స్కూడా ఉన్నాయి. ధరలు రూ.4,000 నుంచి రూ.40,000 వరకు ఉంటాయి.