![ఈవీఎంలలో డేటాడిలీట్ చేయొద్దు.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం](https://static.v6velugu.com/uploads/2025/02/dont-delete-evm-data-supreme-court-to-election-commission-on-vote-verification-plea_VXLriSolpA.jpg)
న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఎలక్ట్రానిక్ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో డేటాను డిలీట్ చేయొద్దని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎలక్షన్ అనంతరం ఈవీఎంల విషయంలో ఎలాంటి స్టాండర్డ్ఆపరేటింగ్ ప్రొసీజర్ను అనుసరిస్తున్నారని ప్రశ్నించింది.
ఎలక్షన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించరాదంటూ దాఖలైన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈవీఎంలలో డేటాను తొలగించొద్దని, కొత్తగా రీలోడ్ చేయొద్దని, వాటిని పరిశీలించాల్సి ఉందని సీజేఐ సంజయ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
ఓడిపోయిన అభ్యర్థి సందేహాలను నివృత్తి చేయాల్సిన, ఈవీఎం ట్యాంపరింగ్ కాలేదని నిరూపించాల్సిన భాధ్యత ఇంజినీర్పై ఉంటుందని పేర్కొన్నది. ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో వెల్లడిస్తూ.. 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.