
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు..ఇప్పుడు పోస్టాపీసుపై పడి ఖాతాదారులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సేమ్ టు సేమ్ ఇండియా పోస్ట్ మాదిరిగానే మేసేజ్ లు, లింక్ లు పంపుతూ ఇంపార్టెంట్ డేటా, నగదు కాజేస్తున్నారు. లింకులు పంపించి ఆ సైట్ లద్వారా మీ డివైజ్ లోకి మాల్వేర్ ఇన్ స్టాల్ చేస్తున్నారు. దీనివ ల్ల మీ డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.
ఇలాంటి మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఆన్ లైన్ స్కాముల గురించి కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి.
- ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ట్రిక్స్ వినియోగిస్తున్నారు.. ఇలాంటి స్కామ్ లను కట్టడి చేయాలంటే అలెర్ట్ గా ఉండాలి.
- అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయొద్దు.
- URLలను తెరవడానికి ముందు అవి నకిలీవా కాదా చెక్ చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ మాత్రమే చూడాలి. ఏవైనా అప్డేట్ చేయాలంటే ఇండియా పోస్ట్ వెబ్సైట్(www.indiapost.gov.in) ను సందర్శించాలి.
- వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
- ఇండియా పోస్ట్ SMS లేదా లింక్ల ద్వారా చిరునామా అప్డేట్లను ఎప్పూడు అడగదు..ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.
- అటువంటి మోసపూరిత మేసేజ్లు వస్తే cybercrime.gov.inకు లేదా PIB ఫ్యాక్ట్ చెక్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్కు రిపోర్టు చేయాలి.