Devara: థియేటర్లలో పూనకాలు పక్కా.. అంచనాలు పెంచేసిన దేవర DOP పోస్ట్

Devara: థియేటర్లలో పూనకాలు పక్కా.. అంచనాలు పెంచేసిన దేవర DOP పోస్ట్

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవర సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా దేవర డీఓపీ (ఛాయాగ్రాహకుడు) రత్నవేలు వీఎఫ్‌ఎక్స్‌పై పెట్టిన పోస్ట్‌ అందరి అంచనాలను రెట్టింపు చేసింది. ‘‘దేవర’ కలర్‌ గ్రేడింగ్‌, మ్యాచింగ్‌ భారీ వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపినట్టుగా ఆయన పేర్కొన్నాడు.

ALSO READ : దేవర మూవీకి టికెట్ల పెంపు..ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

ప్రీమియర్‌ లార్జ్‌ ఫార్మట్‌, డీ బాక్స్‌, 4డీఎక్స్‌, ఓవర్సీస్‌ 2.35 ఎంఎం కంపెనీలు కంటెంట్‌ను సరైన సమయానికి అందించాయి. మా దేవరను థియేటర్‌లలో చూసి ఆనందించండి’..అలాగే ప్రతి ఒక్కరు సినిమాను ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోతో పాటు.. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు సంబంధించిన పిక్‌ను షేర్‌ చేశారు.

గతంలోనూ డీఓపీ  రత్నవేలు దేవర సినిమా విజువల్‌ వండర్‌ అని చెప్పడం.. ఇక ఇపుడు ఆయన నిద్రలేని రాత్రులు గడిపానని తెలియజేయడం..దేవర సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.  రత్నవేలు తాజా పోస్ట్‌తో థియేటర్లలో పూనకాలు పక్కా అంటూ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు.

కాగా రేపు సెప్టెంబర్ 21న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని నోవాటెల్ HICCలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్‌ లో టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్‌, కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.