ఈ మధ్య ప్రతి ఫంక్షన్ విందులో ఐస్ క్రీం ఇస్తున్నారు. మార్కెట్లో రక రకాల ఐస్ క్రీంలు ఉన్నాయి. ఇప్పడు తాజాగా కొత్త రకమైన ఐస్ క్రీం మార్కెట్లోకి విడుదలైంది. ఇందులో స్పెషల్ ఏమనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోపై ఓ లుక్కేయండి. . .
చాలా కొత్త రకమైన వంటలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. మరి కొన్ని వీడియోలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. పానిపూరి ఐస్ క్రీం, ఓరియో బిస్కెట్లతో పకోడి, పానిపూరి నూడిల్స్, పానీపూరి గులాబ్ జామ్ వంటి వెరైటీలను చేస్తున్నారు. ఇప్పుడు దోసతో తయారు చేసిన వెరైటీ ఐస్ క్రీం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది..
విషయాన్నికొస్తే..
దోస పిండిని పెనంపై వేసి పెనం అంతా వచ్చేలా చేస్తారు. దీనిపై కొద్దిగా వెన్నవేస్తారు. మామూలుగా అయితే స్పైసీగా ఉండేందుకు కారంపొడి, ఉల్లి లాంటి వేస్తారు. కాని ఇక్కడ మాత్రం చాక్లెట్ సాస్ను వేసి దోస అంతటా వచ్చేలా చేస్తారు. దోస తయారైన తరువాత వృత్తాకార ఆకారంలో కట్ చేసి, ఐస్ క్రీం కోన్ లాగా చుడతారు. అలా శంఖం ఆకారంలో చుట్టిన దోసలో వనిల్లా ఐస్ క్రీం ఉంచుతారు. ఇంకా చాక్లెట్ సాస్, చాక్లెట్ పీస్ లను కూడా టేస్ట్ కోసం వేస్తారు. ఇలా దోసతో తయారు చేసిన ఐస్ క్రీం ఆహార ప్రియులకు చల్లని అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఐస్ క్రీం వంటకంపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఒక వినియోగదారుడు బ్రేకింగ్ న్యూస్ అంటూ .. ఇది చూసి మిస్టర్ దోస ఆత్మహత్య చేసుకున్నాడని కామెంట్ చేశారు. మరొక వినియోగదారుడు హాస్యంగా ... ఒక సీనియర్ అధికారిగా నేను దోసను పూర్తిగా హత్యగా ప్రకటిస్తున్నానని రాసుకొచ్చారు. వీరికి విరుద్దంగా మూడో వ్యక్తి సమర్ధిస్తూ.. దీనిని దోస అని పిలవకపోతే మంచిదంటూ.. ఇదొక ఐస్ క్రీం అని పోస్ట్ చేశారు. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం వంటలు సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నాయి. మరి దోసతో తయారు చేసిన ఐస్ క్రీం ను మీరు కూడా చూడండి. . .
https://www.instagram.com/reel/CtRY__7owC0/?utm_source=ig_embed&ig_rid=58e74219-0fef-4aae-86af-640a4a1acba6