షూట్ కంప్లీట్

షూట్ కంప్లీట్

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం  వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్.  సంజయ్ దత్ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌కి మంచి స్పందన వచ్చింది.

రీసెంట్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ చేసిన ‘స్టెప్పామార్’ మాస్ సాంగ్‌‌‌‌‌‌‌‌కు అయితే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.  కావ్య థాపర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా.. అలీ, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  విడుదల కానుంది.