హైదరాబాద్: 2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉన్నా.. కరోనా కారణంగా చేయలేదు. దీంతో ప్రభుత్వం దగ్గర పూర్తిస్థాయి జనాభా లెక్కలుగానీ, కులాలవారీ వివరాలుగానీ అందుబాటులో లేవు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ సర్కారు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ.. ఆ వివరాలు బయటపెట్టలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేసి, లోకల్బాడీల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే నిరుడు సెప్టెంబర్ 6ననిరంజన్చైర్మన్గా నలుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ను ఏర్పాటుచేసింది.
తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3న రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర్ రావు చైర్మన్గా, బీసీ గురుకుల సెక్రటరీ సైదులును సెక్రటరీగా బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. నవంబర్ 6 నుంచి డిసెంబర్10 వరకు ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024’ పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించారు. గ్రామీణ ప్రజలు ఈ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో, ముఖ్యంగా జీహెచ్ఎంసీలో పబ్లిక్ సహకరించలేదని, చాలా మంది వివరాలు ఇవ్వలేదని, ఎన్యూమరేటర్లపైకి కుక్కలను ఉసిగొల్పారని స్వయంగా పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి సైతం సర్వేలో పాల్గొనని పలువురు ప్రముఖులపై అసహనం వ్యక్తంచేశారు. అదీగాక జీవనోపాధి కోసం పల్లెల నుంచి నగరాలకు వచ్చి, అద్దె ఇండ్లలో ఉంటున్నవారిని సర్వే టీమ్లు కనీసం పలకరించలేదనే విమర్శలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే అసలు కులగణన సిబ్బంది తమ ఇండ్ల వైపు కన్నెత్తిచూడలేదని పలుచోట్ల పబ్లిక్ఆరోపించారు. పోనీ ఇలాంటి వారు తమ గ్రామాలకైనా వెళ్లి కుటుంబ వివరాలు ఇచ్చారా? అంటే అదీ లేదు. ఇలా ఏరకంగా చూసినా సర్వే అసమగ్రంగా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.