నిద్రమాత్రల మత్తులో డ్రైవింగ్

నిద్రమాత్రల మత్తులో డ్రైవింగ్
  • కారుతో బీభత్సం.. వెంబడించి పట్టుకున్న పోలీసులు

జీడిమెట్ల, వెలుగు: నిద్రమాత్రల మత్తులో ఓ వ్యక్తి కారుతో జగద్గిరిగుట్ట బస్​స్టాప్​ వద్ద  బీభత్సం సృష్టించాడు.  అక్కడ ఆగకుండా వెళ్తూ అనంతరం బాలానగర్​ డీసీపీ ఆఫీస్​ వద్ద మరో టూ వీలర్​ను ఢీ కొట్టాడు. అక్కడి నుంచి వెళ్లి  షాపూర్​నగర్​ మార్కెట్​లో ఓ కారును ఢీ కొట్టాడు.   పోలీసుల వివరాల ప్రకారం..  గుండ్ల పోచంపల్లికి చెందిన  అంబు సోమశేఖర్​ (48)బిజినెస్​ చేస్తుంటాడు.  గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో   హోండా సిటీ కారువేగంగా  నడుపుతూ జగద్గిరిగుట్ట బస్​స్టాప్​ వద్ద బీభత్సం గా డ్రైవ్​ చేశాడు.  

 గాజులరామారం చౌరస్తాలో  విధులు నిర్వహిస్తున్న ఎస్సై సందీప్​ పోలీసు సిబ్బందిని అలర్ట్​ చేసి..   సోమశేఖర్​ను  వెంబడించి సూరారం వద్ద పట్టుకున్నారు.  ఆ సమయంలో అతడు మత్తులో ఉన్నాడు. డ్రంకన్​ టెస్ట్​ నిర్వహిచంగా అతడు మద్యం తాగలేదని తేలింది. దీంతో అతని భార్యకు సమాచారం ఇవ్వగా అతడు నిద్రమాత్రలు వేసుకునే అలవాటు ఉందని  తెలపడంతో అతన్ని సూరారం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.