భారత అమ్ములపొదిలో 5.5 జనరేషన్​ స్టెల్త్​ ఫైటర్

భారత అమ్ములపొదిలో 5.5 జనరేషన్​ స్టెల్త్​ ఫైటర్

వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద స్టెల్త్​ రకం యుద్ధ విమానాలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీవో) అభివృద్ధి చేయనున్నది. 5.5 జనరేషన్​ స్టెల్త్​ ఫైటర్​ నమూనాను తమిళనాడులోని సూలూరులో జరిగిన ఏవియేషన్​ ఎక్స్​పో ఐడాక్స్​ 2024లో డీఆర్డీవో ప్రదర్శించింది. 2035 నాటికి భారత అమ్ములపొదిలో 5.5 జనరేషన్​ స్టెల్త్​ ఫైటర్​ చేరనున్నది. ఇవి సిద్ధమైతే స్టెల్త్​ ఫైటర్ల సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల సరసన మన దేశం నిలువనున్నది. ఏడు టన్నుల బరువు ఉండే ఏఎంసీఏ విమానాలు క్షిపణులు సహా భారీ ఆయుధ సామగ్రిని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తెలిపింది. 

డీఆర్​డీవో ప్రస్తుతం అత్యాధునిక 5.5 జనరేషన్​ అడ్వాన్స్​డ్​ మీడియం కంబాట్​ ఎయిర్​ క్రాఫ్ట్​ ఏఎంసీఏను అభివృద్ధి చేస్తున్నది. అతికొద్ది దేశాల వైమానిక దళంలో ఉన్న స్టెల్త్​ రకం యుద్ధ విమానాలను దేశీయంగా అభివృద్ధి చేస్తున్నట్లు డీఆర్​డీవో తెలిపింది. 

ప్రస్తుతం భారత వైమానిక దళంలో స్టెల్త్ రకం యుద్ధ విమానాలు, అభివృద్ధి సాంకేతికతలు లేవు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఏఎంసీఏ 2034 నాటికి ట్రయల్స్​ పూర్తి చేసుకోనున్నాయి. 2035 నాటికి వీటిని వైమానిక దళంలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.