రాత్రిపూట చక్కగా నిద్రపట్టేందుకు వేడి పాలు తాగుతారు చాలామంది. అయితే, చెర్రీ జ్యూస్, చామంతి టీ తాగినా, అరటిపండు, బాదం స్మూతీ తిన్నా కూడా తొందరగా నిద్ర పడుతుందట.
• చామంతి పూలని కప్పు వేడినీళ్లలో వేస్తే, చామంతి టీ రెడీ. రాత్రి పూట ఈ టీ తాగితే చక్కగా నిద్రపట్టడమే కాదు జలుబు, ఇన్ ఫ్లమేషన్ వంటివి తగ్గుతాయి కూడా.
• అరటిపండు, బాదం స్మూతీలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మైండ్ ని రిలాక్స్ చేస్తాయి. దాంతో హాయిగా నిద్రపోవచ్చు.
• తియ్యగా, వగరుగా, పుల్లగా ఉండే చెర్రీ పండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.