
- 2,053 చ. కి.మీ. ప్రాంతాన్ని వీడియో తీసి డిజిటలైజేషన్
- నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ
- డెవలప్మెంట్ కోసం ప్లాన్తో ముందుకు పోతున్న సర్కారు
- మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ముందడుగు
హైదరాబాద్సిటీ, వెలుగు : ఔటర్తో పాటు దాని పరిసరాల్లోని మున్సిపాలిటీలను కలిపి ‘తెలంగాణ కోర్అర్బన్ రీజియన్(టీసీయూఆర్)’ అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పూర్తి ఏరియాను లైడార్, డ్రోన్సర్వే చేయించేందుకు సిద్ధమైంది. దీని కోసం హెచ్ఎండీఏ నోడల్ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇప్పటికే బల్దియా ఏడాదిగా తన పరిధిలోని ఆస్తుల మ్యాపింగ్ కోసం జియోగ్రాఫికల్ఇన్ఫర్మేషన్సిస్టమ్(జీఐఎస్) సర్వే చేస్తోంది. అదే తరహాలో హెచ్ఎండీఏ కూడా డ్రోన్అండ్ లైడార్ సర్వే చేయించబోతోంది. డ్రోన్ సర్వేలో డ్రోన్ కు ఒకే కెమెరా ఉంటుంది. లైడార్ సర్వేలో విమానం లాంటి డ్రోన్ కు ఐదు కెమెరాలుంటాయి. ఇది గాలిలో చక్కర్లు కొడుతూ ఆయా ప్రాంతాల్లోని దృశ్యాలను 360 డిగ్రీస్ లో వీడియో తీస్తుంది.
సర్కారు దృష్టి అంతా ఔటర్పైనే..
ప్రస్తుతం ప్రభుత్వం దృష్టంతా ఓఆర్ఆర్పరిసర ప్రాంతాలు, ట్రిపుల్ఆర్డెవలప్మెంట్పైనే ఉంది. భవిష్యత్లో ఆయా ప్రాంతాలు భారీ ఎత్తున అభివృద్ధి సాధించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్లాన్ప్రకారం ముందుకు పోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముందుగా ఓఆర్ఆర్లోపల ఉన్న 28 మున్సిపాలిటీల కలిపి 2,053 చ, కి.మీ. భూభాగాన్ని సర్వే చేయాలని నిర్ణయించి పనులను హెచ్ఎండీఏకు అప్పగించింది. బల్దియా ఇప్పటికే ఆస్తుల మ్యాపింగ్చేసి ఆస్తిపన్ను కచ్చితంగా వసూలు చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది. అందులో భాగంగానే డ్రోన్సర్వేలు చేయిస్తోంది. కానీ, హెచ్ఎండీఏ ఏకంగా డ్రోన్, లైడార్సర్వే చేయాలని నిర్ణయించింది.
సర్వే ఎందుకంటే..
ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాలను డ్రోన్, లైడార్సర్వే చేయించడం వల్ల ఆయా ఏరియాల్లోని ప్రతి అంశాన్ని కచ్చితత్వంతో గుర్తించి డిజిటల్రూపంలో రికార్డు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఈ సర్వే అయా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్, ఇతర అన్ని రకాల వసతుల కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక కమిటీల ఏర్పాటు
సర్వే సందర్భంగా శాఖల మధ్య సమన్వయం, ఇతర సహకారం కోసం ప్రభుత్వం రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో హెచ్ఎండీఏ కమిషన్చైర్మన్గా, బల్దియా కమిషనర్వైస్చైర్మన్గా, డైరెక్టర్టౌన్ప్లానింగ్అండ్కంట్రీప్లానింగ్(డీటీసీపీ) మెంబర్కన్వీనర్ గా, మెట్రోవాటర్ బోర్డు, టీజీఐఐసీ, ఐఐటీ హైదరాబాద్తదితరులు మెంబర్లుగా ఒక కమిటీ, వర్కింగ్కమిటీకి రాష్ట్ర చీఫ్సెక్రటరీ చైర్మన్గా, హెచ్ఎండీఏ కమిషనర్కన్వీనర్గా మరో కమిటీ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ త్వరలోనే ఆయా ప్రాంతాల్లో డ్రోన్, లైడార్సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని, దాని ఆధారంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా నిర్వహించాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు.