
మాదాపూర్, వెలుగు: హైదరాబాద్ ఐటీ కారిడార్లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ పబ్లో మాదాపూర్ పోలీసులు పలువురికి డ్రగ్స్ టెస్టులు చేయగా, ఒకరికి పాజిటివ్ వచ్చింది. జూబ్లీహిల్స్లోని ఆలివ్ బిస్ట్రో పబ్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో మాదాపూర్ పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. పబ్లోని 20 మందికి టెస్టులు నిర్వహించారు. ఇందులో జూబ్లీహిల్స్ కు చెందిన సిద్ధార్థ్(23) అనే యువకుడికి గంజాయి పాజిటివ్ వచ్చింది.
సిద్ధార్థ్ జనవరి 31వ తేదీన థాయిలాండ్ వెళ్లినట్లు, అక్కడ బిస్కెట్లు తిన్నానని, అందులో డ్రగ్స్ ఉన్నట్లు తనకు తెలియదని పోలీసుల ఎదుట అంగీకరించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ సెంటర్కు తరలించారు.