అంబులెన్స్​ డ్రైవర్ ​అడ్డగోలు తాగుడు .. బ్రీత్​ అనలైజర్​ పరీక్షలో 230 దాటిన పాయింట్లు

అంబులెన్స్​ డ్రైవర్ ​అడ్డగోలు తాగుడు .. బ్రీత్​ అనలైజర్​ పరీక్షలో 230 దాటిన పాయింట్లు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గోపాలపురం పీఎస్​పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్​అండ్​డ్రైవ్​లో ఓ అంబులెన్స్​ డ్రైవర్ తప్పతాగి ​దొరికాడు. ఓవర్​స్పీడ్​తో వస్తున్న అంబులెన్స్ ను ఆపగా, డ్రైవర్ ​ఫుల్లుగా తాగినట్టు కనిపించాడు. దీంతో అతడికి బ్రీత్ అనలైజర్ తో పరీక్ష నిర్వహించగా, రీడింగ్ 234 వచ్చింది. 

వెంటనే అదుపులోకి తీసుకుని అంబులెన్స్ ను సీజ్ చేశారు. డ్రైవర్​ పై కేసు నమోదు చేశారు.