వరదలపై అలర్ట్​గా ఉండాలి : డీఎస్పీ రవీందర్​రెడ్డి 

వరదలపై అలర్ట్​గా ఉండాలి : డీఎస్పీ రవీందర్​రెడ్డి 

పినపాక, వెలుగు : మావోయిష్టుల కదలికలపై, గోదావరి వరద ముంపు ప్రాంతాలపై పోలీసులు ఎప్పుడూ అలర్ట్​గా ఉండాలని మణుగూరు డీఎస్పీ రవీందర్​రెడ్డి సూచించారు. మండలంలోని ఏడూళ్లబయ్యారం పోలీస్​ స్టేషన్​ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజాసమస్యల పట్ల పారదర్శకంగా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పోలీసులకు సూచించారు.

అనంతరం మండలంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాలైన రావిగూడెం, భూపతిరావుపేట గ్రామాలను సందర్శించారు. గోదావరి వరద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్సై రాజకుమార్​ ఉన్నారు.