
దుబ్బాక, వెలుగు : దుబ్బాక ఐవోసీకి ప్రభుత్వం మరో రూ. 6 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రఘునందన్రావు కోరారు. బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ నెల 11న మంత్రి హారీశ్రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశించారు. సమీకృత భవనాన్ని గురువారం అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనంలో కొలువు దీరే శాఖల అధికారులు కలెక్టర్ సూచనల మేరకు షిప్ట్ చేసుకోవాలని సూచించారు. భవనానికి ప్రభుత్వం రూ. 17 కోట్లను మంజూరు చేసిందని, నిర్మాణానికి కాంట్రాక్టర్లు రూ. 14 కోట్లను ఖర్చు చేశారని తెలిపారు.
మిగతా రూ. 3 కోట్లతోపాటు అదనంగా మరో రూ. 6 కోట్ల నిధులను మంజూరు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ప్రధాన రోడ్డు నుంచి ఐవోసీ బిల్డింగ్ వరకు సీసీ రోడ్డును మంజూరు చేయాలని కోరారు. తాను గెలిచిన తర్వాతనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పెండింగ్లో ఉన్న బస్టాండ్, వంద పడకల ఆసుపత్రి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి ప్రారంభించుకున్నామని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ భవనాన్ని పూర్తి చేసి ఇదే నెలలో విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్రెడ్డి, మట్ట మల్లారెడ్డి, దూలం వెంకట్ గౌడ్, సుంకు ప్రవీణ్, పగడాల నరేందర్, రమేశ్రెడ్డి, తొగుట రవి
పాల్గొన్నారు.