వాగులు దాటనిస్తలేవు

వాగులు దాటనిస్తలేవు

నాగర్​ కర్నూల్​.వెలుగు : ఇటీవలి వర్షాలకు జిల్లాలోని చిన్నాచితక డొంకలు,పెద్ద వాగులకు వరద ప్రవాహం తగ్గడం లేదు. తాడూరు,మిడ్జిల్​,కల్వకుర్తి, తెల్కపల్లి,ఉప్పునుంతల మండలాల్లో డిండి మీద రాకపోకలు నిలచిపోయి దాదాపు 10 రోజులు దాటుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలో నల్లవాగు మెడికల్​ కాలేజీ వెనక నుంచి కేసరిసముద్రంలోకి వెళ్తోంది.

కొల్లాపూర్​ మండలంలో ముక్కిడిగుండం-నార్లాపూర్​ వాగు,కోడేరు పస్పుల వాగు, లింగాల, బల్మూరు, అచ్చంపేట మీదుగా చంద్రవాగు ప్రవాహం శనివారం రాత్రి ఆమన్​గల్​, తలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వెల్దండ మండలంలోని గానుగగట్టు తండా- బైరాపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్డు మీదగా వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పోలీస్​,రెవెన్యూ అధికారులు రాక పోకలను నిలిపివేశారు.

ప్రజలు వాగుల్లో చేపలు పట్టడం, ఫొటోలు దిగవద్దని హెచ్చరిస్తున్నారు.కోడేరు మండలం రాజాపురం గ్రామం నుంచి నాగులపల్లి వెళ్లే రోడ్డులో కల్టర్ట్​ వద్ద లొంకోళ్ల వాగు తెగిపోయి రాకపోకలు ఆగిపోయాయి.

జారుడుబండలైన కాజ్​వేలు 

జిల్లాలోని ప్రధాన వాగుల మీద నిర్మించిన కాజ్​వేలు ప్రమాదకరంగా మారుతున్నాయి.కాజ్​వేల మీదుగా ప్రవహిస్తున్న వరద నీటితో కాజ్​వేలు కనిపించకుండా పోతున్నాయి.రెవెన్యూ,పోలీస్​ అధికారులు రాకపోకలు అడ్డుకుంటున్నా అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి.వరద తగ్గిన తర్వాత నాచుతో పాకర పట్టే కాజ్​వేలపై జారిపోయే బైకులపై నుంచి పడి పలువురు తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.