మార్చి కల్లా డంప్​యార్డు సమస్యకు పరిష్కారం

మార్చి కల్లా డంప్​యార్డు సమస్యకు పరిష్కారం

హనుమకొండ, వెలుగు: మడికొండ డంప్​యార్డు సమస్యకు మార్చి నాటికి పరిష్కారం చూపుతామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు హామీ ఇచ్చారు. డంపింగ్​యార్డు తరలించాలనే డిమాండ్​తో ఉద్యమం చేపట్టిన అడ్​హక్​కమిటీ సభ్యులు బుధవారం హనుమకొండలోని క్యాంప్​ఆఫీస్​లో ఎమ్మెల్యే కేఆర్​నాగరాజును కలిశారు. డంప్​యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, చాలామంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి డంప్​ యార్డు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్​హక్​ కమిటీ సభ్యులు ఎర్రగట్టు స్వామి, కరుణాకర్​రెడ్డి, దువ్వ నవీన్ తదితరులు పాల్గొన్నారు.