
-
జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి
హైదరాబాద్సిటీ/మాదాపూర్, వెలుగు: దుర్గం చెరువులోకి చేరే మురుగునీటికి చెక్ పెట్టి, వర్షపు నీరు చేరేలా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ఇలంబరితి శేరిలింగంపల్లి జోన్అధికారులను ఆదేశించారు. మంగళవారం మాదాపూర్లోని దుర్గం చెరువును జోనల్కమిషనర్, జలమండలి, ఇంజినీరింగ్అధికారులతో కలిసి కమిషనర్పరిశీలించారు. వాటర్బోర్డు చేపట్టనున్న మురుగునీటి డైవర్షన్ నిర్మాణ పనులపై చర్చించారు.
ఎస్ఎన్డీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న స్ట్రామ్ వాటర్ లైన్ పురోగతిని పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ మురుగునీటిని దారి మళ్లించేలా డ్రైనేజీల నిర్మాణానికి సమర్థవంతమైన ప్లాన్లు రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్లోనూ మురుగునీటి పరిమాణాన్ని తట్టుకునేలా పైపుల నిర్మాణం ఉండాలన్నారు. వర్షపు నీరు స్ట్రామ్ వాటర్ చెరువులోకి చేరేలా నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్, సంబంధిత విభాగాల అధికారులను బల్దియా కమిషనర్ ఇలంబరితి ఆదేశించారు.