జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడపండి..

జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడపండి..

ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు.  ఖమ్మం ఆర్టీసీ ఆర్ ఎం తో  ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క పలు గ్రామాలకు బస్సులు నడిచే అంశంపై చర్చించారు.  

చాలా ప్రాంతాలకు  బస్సులు  నడవడం లేదని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి దాదాపుగా రూ. 400 కోట్లు నెలకు ఇస్తున్నామని. ఇన్ని కోట్లు ఇస్తున్నప్పుడు ప్రజల అవసరాలు కూడా ఆర్టీసీ తీర్చాలని ఖమ్మం ఆర్టీసీ ఆర్ఎం కు బట్టి విక్రమార్క సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఖమ్మం జిల్లాలోని ఆర్పీలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమకు  అయిదు నెలలగా జీతాలు రావడంలేదని. చాలావరకు మహిళలు 50 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారని వారందరికీ ప్రభుత్వపరంగా వైద్య  సౌకర్యాలను కల్పించాల్సిందిగా బట్టి నీ కోరారు. మీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..