![ఢిల్లీలా హైదరాబాద్ను కానివ్వం.. అన్నివాహనాలను ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మారుస్తాం : డిప్యూటీ సీఎం భట్టి](https://static.v6velugu.com/uploads/2025/02/green-telangana-summit-2025-dy-cm-bhatti-vikramarka-minister-sridhar-babu_r4wF9kt0Op.jpg)
భవిష్యత్ లో హైదరాబాద్ లోని చాలా వెహికల్స్ ను బ్యాటరీ వెహికల్స్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎలక్ట్రానికి వాహనాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో గ్రీన్ తెలంగాణ సమ్మిట్ కు హాజరైన భట్టి.. భవిష్యత్తులో సిటీలో ఉన్న బస్సులను దశలవారీగా బ్యాటరీ బస్సులుగా మారుస్తామని చెప్పారు. ఢిల్లీ లాగా మన హైదరాబాద్ ని కానివ్వబోమన్నారు. భవిష్యత్ లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులనే నడిపిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ ముఖ్యమంత్రి డ్రీమ్.. దానిని నెట్ జీరో సిటీగా చేయబోతున్నాం. హైదరాబాద్ ను నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు భట్టి.
మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో ఒక మైలు రాయి లాంటిదని చెప్పారు భట్టి. మూసీలో మంచినీళ్లు పారేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూసీ ప్రక్షాళన కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. దశాబ్ద కాలంగా స్టేట్ లో ఎనర్జీ పాలసీ లేదన్నారు భట్టి. దావోస్ లో రాష్ట్రానికి లక్షా 50వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం 10 వేల కోట్లు కేటాయించాం..ఫ్లై ఓవర్లు, సబ్ వే లు నిర్మిస్తామన్నారు.
ALSO READ | ఢిల్లీలో సీఎం రేవంత్.. కులగణన, రిజర్వేషన్లపై చర్చ.!
రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పారు. బిల్డర్స్ ని ఇబ్బంది పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడు చూడదన్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్ లకి రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్ ఉంటుందన్నారు. తెలంగాణ యంగ్ స్టేట్ అయినా చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తాము చేసేపని ప్రతిదీ రాష్ట్రాభివృద్ధి కోసమేనని చెప్పారు.