సంగారెడ్డిలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన జనం

సంగారెడ్డిలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన జనం

సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్  మండలంలో భూప్రకంపనలు వచ్చాయి. న్యాల్ కల్ , ముంగి  గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి  కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూ ప్రకంపనలు వచ్చే సమయంలో వింత శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కాసేపు ఏం జరుగుతోందనని టెన్షన్ పడ్డారు. అయితే  ఈ భూ ప్రకంపనాల కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు.  ఈ భూప్రకంపనలపై అధికారులు ఆయా గ్రామాల్లో ఆరాదీస్తున్నారు.