
కోల్కతాలో భూకంపం సంభవించింది.మంగళవారం (ఫిబ్రవరి 25) తెల్లవారు జామున రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపకేంద్రం బంగాళాఖాతంలో 91కిలోమీటర్లు లోతులో కోల్కతా సమీపంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టం గురించి ఇంకాతెలియరాలేదు.
EQ of M: 5.1, On: 25/02/2025 06:10:25 IST, Lat: 19.52 N, Long: 88.55 E, Depth: 91 Km, Location: Bay of Bengal.
— National Center for Seismology (@NCS_Earthquake) February 25, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/J6q53lzNd1
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం..భూకంప కేంద్రం బంగాళాఖాతంలో 19.52°N అక్షాంశం,88.55°E రేఖాంశం వద్ద ఉంది. ఉపరితలం నుండి ఐదు లేదా 10 కిలోమీటర్ల దిగువన ఉద్భవించే నిస్సార భూకంపాలు, ఉపరితలం క్రింద ఉద్భవించే వాటి కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని తెలిపింది. ఆదివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఒక మోస్తరు తీవ్రతతో భూకంపం సంభవించిన రెండు రోజులకే ఇది జరిగింది.