సాత్విక్‌‌‌‌-చిరాగ్‌‌‌‌కు ఈజీ డ్రా

సాత్విక్‌‌‌‌-చిరాగ్‌‌‌‌కు ఈజీ డ్రా

–న్యూఢిల్లీ : ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు  సాత్విక్ సాయిరాజ్‌‌‌‌, చిరాగ్ షెట్టికి పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో సులువైన డ్రా ఎదురైంది. థామస్‌‌‌‌ కప్‌‌‌‌, కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో గోల్డ్ మెడల్స్‌‌‌‌ సాధించిన ఈ ఇద్దరు మూడో సీడ్‌‌‌‌గా బరిలోకి దిగనున్నారు. మెగా ఈవెంట్‌‌‌‌లో గోల్డ్ మెడల్ ఫేవరెట్లుగా భావిస్తున్న ఇండియా షట్లర్లు గ్రూప్‌‌‌‌–సిలో పోటీ పడనున్నారు.

ALSO READ : 16వ సారి కోపా అమెరికా విజేతగా అర్జెంటీనా

ఈ గ్రూప్‌‌‌‌లో ఆరో ర్యాంక్స్‌‌‌‌ ఫజర్ అల్ఫియన్‌‌‌‌–ముహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) మాత్రమే వారికి కఠిన ప్రత్యర్థులు కానున్నారు. 31 ర్యాంకర్లు మార్క్‌‌‌‌ లమ్స్‌‌‌‌ఫుస్‌‌‌‌–మెర్మలిన్‌‌‌‌ సీడెల్‌‌‌‌, 43వ ర్యాంకర్లు రోనన్ లేబర్‌‌‌‌‌‌‌‌–లూకాస్‌‌‌‌ కోర్వీ ఈ గ్రూప్‌‌‌‌లో ఇతర ప్రత్యర్థులుగా ఉన్నారు.